పుట:హంసవింశతి.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 127



తే. పోయి యా కాళికోవెల పొంత నిలిచి
కటికి మబ్బున నలుదెస ల్గలయఁ జూచి
జాలుఁ డాచాయ లేకున్న సంశయించి
మనసుఁ దెలియఁగ డాఁగెనో యని తలంచి. 39

ఉ. చీమ చిటుక్కుమన్న వినుఁ జిమ్మట బుఱ్ఱన నేఁగు నంతలో
నే ముదమంది చూచు సరణిన్ బశుపక్షిమృగాదిజంతువుల్
వేమఱుఁబోవు చప్పుడులు విస్మయ మందఁగ నాలకించు "నా
హా! మఱి రాక తక్కెనె" యటంచుఁ దలంచు వియోగవేదనన్. 40

క. "ఏరా తాళఁగ లేరా!
రారా! నన్నేచ నేల? రారా! రాపుల్
మేరా? మోహనరూపశ
రీరా! యటుడాఁగి పల్కరింప వదేరా?" 41

మ. అని వాచాలి ప్రియంపుఁ బల్లవుని డాయం బిల్వఁగా మ్రోయు వా
గ్ధ్వను లాలించి నిజాంగనాగళరవవ్రాతం బిదౌ నిశ్చయం
బనుచుం దద్విభుఁ డప్పుడొక్కపనికై యాదారిగాఁ బోవుచున్
గని “యిట్లేటికిఁ జీరెదీ" వనుచుఁ బల్కన్ గాంత తానంతటన్. 42

క. ఎటువలె బొంకఁగ వలెనో
కుటిలాలక! నీవు తెలిసికొమ్మని యనఁగా
నిటునటుఁ జూ చది తెలియదు
పటుసూక్తిని నీవె తెలుపు పత్రిప! యనినన్. 43

క. ఆ మానసౌక మప్పుడు
హేమావతి కనియెఁ దను నిజేశుం డడుగన్