xvii
తే. పాదముల కంబుజము చెల్లుఁ బరఁగు నడకుఁ
దనరు మత్తేభవిక్రీడితంబు సెల్లుఁ
గృతుల వర్ణింపఁదగు తదాకృతులె కృతులు
వాంఛచే దానిఁబొందిన వాఁడె సుకృతి.
(హంస. 1-62)
దీనిచే నతనికిఁ బొందువడునది రతిసామ్రాజ్యము కాదు : సరస్వతీ సామ్రాజ్యము మాత్రమే అని ధ్వని.
శివసత్తి వచ్చి ఱేని యెదలోఁ జిచ్చు రగిల్చి పోయినది. ఱేఁడు దిక్కులేని స్థితిలోఁ బడియుండఁగా హేలయను కుటిలాలక వచ్చెను. హేల మాలిని. తాపికత్తె. కార్యభారము తన నెత్తిన వేసికొనెడు. సాతానిరాణి యింటికి దారితీసెను. రాకపోకలు సాఁగించెను. చనవు బలిసెను. ఒకనాఁడు అటునిటు చూచి, తన గ్రంథము విప్పెను. నీవు చక్కని చుక్కవు. రాజోత్సంగమున నుండఁదగిన దానవు. "మర్కటము వంటివాఁడు నీ మగఁడు చూడ వానితోఁ గూడి రతికేళిఁ బూనుటెట్లు?" (1-91) ఈ రీతిగా మాలిని చేఁదు కాయకోసి మనసు విఱిచి, హేమవతిని దన యంకెకుఁ ద్రిప్పుకొన్నది. తెగువచాలక వెనుక ద్రొక్కుట చూచి.
క. ఎక్కడి మగఁ డెక్కడి సఖు
లెక్కడి నీ యత్తమామ లెక్కడి చుట్టా
లిక్కొలఁది దొడ్డ కొంచెము
లెక్కింపకు మరుని హావళిం బడువేళన్.
అని యామెమేలుకోరి ప్రోత్సహించినది. కనుకనే చెడిపెలకుఁ జెవి యీయ రాదనిరి. మాలినికంటె ధూర్త స్త్రీ యుండదు.
“నరాణాం నాపితో ధూర్తః
పక్షిణాం చైవ వాయసః