పుట:హంసవింశతి.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 97



కేళి కైతేను నీకిది కేవలంబు
దొడ్డగాదు విచారించి తోనే చెపుమ! 165

క. అనినఁ గలహంస పలుకులు
విని హేమావతి విచార విపులాబ్ధి మునిం
గినమది నాకిది తెలియదు
వినిపింపుము నీవె యనిన విధహరి యనియెన్. 166

చ. అటువలెఁ జారుభాస్వతి ధరామరుఁ గౌఁగిఁటఁ జేర్పఁజూచి, తాఁ
జటులతరోగ్రభాష హరిశర్మ యదల్చినఁ దొట్రుపాటునం
బెట్టిలక "యీతనిన్ వినుము పిన్నతనంబున దేశచారియై
పటుగతిఁ బోయె మాతులునిపట్టి సుమీ” యని లేని దీనతన్. 167

తే. కాంతునకుఁదెల్పి మఱమఱి కౌఁగిలించి
చెమటకణములు తనపైఁట చెఱఁగుచేతఁ
దుడిచి యాతని కేల్వట్టి తోడి తెచ్చి
మేలమాడుచుఁ బానీయశాల కపుడు. 168

సీ. “గొనబుతో నెన్నాళ్లకో సెల్వుగా నేటి
కైన నిన్నెనయ నాకబ్బె"ననుచు
“నీకు నామీదాన నిజముగాఁ జెప్పుమా
నాయందుఁ బ్రేమకద్దా?" యటంచుఁ
“బదిదినా లుండక, పాఱిపోయెదనన్నఁ
బోనిచ్చునా? వెఱ్ఱదైన” ననుచు
“నీప్రొద్దు సుదివసం బే నోముఫలమొ! నా
మనసులో నెంజిలి మానె"ననుచుఁ
తే. జేరిక లొనర్చి తేనియల్ చిలుకఁబలికి
మోహమూరించి తరిదీపు మోపుకొల్పి