పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

25

ముగురుదునేదార్లు మొగి సన్నుతింప
బాపురే మాయయ్య భళిభళీ యనుచు 400
గోపాలరాజు చేకొని చూచి మెచ్చ
నళుకు బెళుకును లేక నాహవభూమి
తెలుఁగుబిజ్జలుమాడ్కి తెగువతోఁ జొచ్చి
మొనసి కందనయోలి ముట్టడి యల్ల
మునుమున్నె విడిపించి మోహరంబైన 405
బలుదునేదారుల భంజించి వైచి
పొలుపొంద గం ధేభముల నుగ్గుఁ జేసి
పొదలగ నీబుల పొం గణగించి
యెదురుపరాణీల నెల్ల మట్టాడి
చెలరేఁగి యెగసి నజీరులఁ జిదిపి 410
కలడక్కినీలఁ జీకాకుఁ గావించి
డేరాలత్రాళ్లెల్ల తెగ నరికించి
కోరి భాండారముల్" కొల్ల లాడించి
తనపేరు వారికందనయోలికోట
యనురాగమున సొచ్చి యారాజుచేత జు 415
మెచ్చులు గైకొని మేదినీపతులు