ఈ పుట ఆమోదించబడ్డది
314
సౌగంధిక ప్రసవాపహరణము
ద్రౌపదిని అర్జునుఁడు ఊరార్చుట
గనుఁగొని లాలించి గాండీవి పలికె
మానినీమణి యనుమానంబు వలదు;
ప్రాణంబు లున్నవి పవనజుమేన
వూనిన బలుమూర్ఛ పొంది యున్నాఁడు; 2125
కాని విచారంబు కలనైన లేదు
మీనాక్షి వెరవకు మిక్కిలి యతని
ప్రాణంబునకు నాదు ప్రాణ మిచ్చెదను;
అనుచు దుఃఖము మాన్పి యక్కునఁ జేర్చి
నను జూడు మని సింహనాదము చేసి 2130
నలకూబరార్జునుల సమరము
నలకూబరుని గాంచి నారి మ్రోయించి
తలకొని దేవదత్తంబు పూరించి
యరదంబు దోలించు నాసమయమునను
సురవైరి పడియున్నఁ జూచి యర్జునుఁడు
అక్షుల మిణుగురు లశ్రు సంఘములు 2135
నక్షయంబుగ థాత్రి నవఘళింపఁగను