ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయాశ్వాసము
311
యతని నెచ్చెలికాండ్ర నరువదికోట్ల
శితసాయకంబుల జీకాకుపఱచి
గరుడ కిన్నర యక్ష, ఖచరుల నూట
యరువదికోట్ల యోధావళిఁ దునిమి
మునుమున్న మున్నూట ముప్పదికోట్ల 2075
దనుజగంధర్వ యోధుల చిక్కుపఱచి
బెడిదంపు పీనుఁగు పెంటలు చేసి
తడయక దేవదత్తంబు పూరించి
యరదంబు రాజరాజాత్మజుమీఁద
పరపుచు పడియున్న పావనిఁ గాంచి 2080
యమరేంద్ర నందనుం డడరి శోకించి
క్రమమున గొంత ధైర్యస్వాంతుఁ డగుచు
నరదంబు డిగి యెత్తి యక్కునఁ జేర్చి
తొరగు నెత్తురులు పోదుడిచి హా యనుచు
మోముమోమునఁ జేర్చి మూర్ఛిల్లి తెలిసి 2085
ధీమనంబున నలుదిక్కులు జూచి
యల శ్రీదనందను నదలించి గదిమి
యలవడ కన్నులు నశ్రులు దుముక