ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయాశ్వాసము
279
ఆవీర యోధుల నలఘు తేజంబు
భావింపఁ గన్నులపండు వయ్యెడిని;
మానవులే యని మసలఁగా వలదు
నీ నేర్పుఁ జూచెద నెరయోధవరుల 1520
బలముల సేనాధిపతుల నేర్పఱచి
కలనికి యరిమొనగా నిల్పు మనినఁ
జని సర్వ సేనల సమకట్టి నిలిపి
ఘనభేరికాహళఘంటికారావ
ముల బెట్టుగా మిన్నుముట్ట మ్రోయించి 1525
కలఁగి పద్నాల్గు లోకములు భేదిల్ల
తరుచుగా సింహనాదములు నేయించి
నిరుపమాటోవుఁడై నిఖిలసైన్యముల
పేరైన యోధుల పేరులు వాడి[1]
భోరున కలనికిఁ బురికొల్పుటయును 1530
భీష్మప్రతాపజృంభితశౌర్యధనుఁడు
- ↑ 1 a. పేరైనయోధుల పేరులు చాపి (క)
b. పేరైనయోధుల పేరులఁ జీరి (చ)