ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయాశ్వాసము
253
సురలతోఁ బోరి మెచ్చులు గన్న వారు
ధార్తరాష్ట్రులు పోమదత్త బాహ్లికులు
వార్త కెక్కిన శౌర్యవరబలాధికులు
శకుని భూరిశ్రవ సైంధవాదులును 1075
మకరాంకవైరితో మార్కొనఁ గలరు
పరువడి నిటువంటి బలియురతోడ
నరుదైన సకలయోధావళితోడ
నేరీతిఁ బోరెద వెట్లు గెల్చెదవు
వీరాగ్రగణ్య యేవిధ మింక ననిన ? 1080
ఘటోత్కచుఁడు ధర్మరాజునకు ధైర్యముఁ జెప్పుట
మేనెల్ల నిక్కించి మీసము ల్దీటి
పూని పెల్లుగ నార్చి భుజములు సరచి
ధారుణీపతిమోముఁ దప్పక చూచి
ఈరీతి చింతింప నేలయ్య మీకు
అక్షీణబలశాలి యావాసుసుతుఁడు 1085
యక్షుల ఖండించి యరుదెంచు నిపుఁడె