పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

235

దుర్యోధనుఁడు సైన్యములతో బదరికావనమున కరుగుట

సకలసన్నాహము ల్సవరించి దిశలు
గకవిక ల్గాఁగ శంఖములు పూరించి,
హితులు బంధులు భూతలేంద్రు లేతేర, 795
నతులిత ద్రోణభీష్మాదులు నడువ,
తతశక్తి నూర్గురు తమ్ములు నడుప,
నతులితాటోపులై యాత్మజు ల్నడువ ,
వితతనానావాద్యవిభవవై ఖరులఁ
జతురంగవాహినీ సహితుఁడై గదలె. 800
ఇంద్రునిఁ బోలె నాగేంద్ర కేతనుఁడు
సాంద్ర వైభన మహాత్సాహియై వెడలి
వడి నేగి బదరికావనమున కరిగి

పాండవు లందు లేకుండుట



తడయక పాండునందనుల శోధించి
యెవ్వరులేమి వా రేఁగినజాడ 805
దవ్వుగాఁ గదలి మార్తాండనందనుని