పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

శ్రీ సీతారామాంజనేయసంవాదము


టీక. దివ్యము = శ్రేష్ఠమయినదియు, భవ్యంబు = క్షేమకర మైనదియు, అగు మత్కావ్యము = అయిన నా కావ్యము, సంతతమున్ = ఎల్లప్పుడును, మోక్షకాలముచేన్ = మోక్షేచ్ఛగలవారిచే, శ్రోతవ్యము = వినఁదగినదియు, వక్తవ్యము = పఠింపఁదగినదియు, మంతవ్యము = మననము, (లేక విచారణము చేయఁదగినదియు), భావ్యమును = అన్నిఁటిలో నుత్తమమని, తలఁపఁదగినదియు, కీర్తితవ్యము = కొనియాడఁదగినదియు, కాదే = కాకుండునా? (అగుననుట. )

తా. పైపద్యమునందు వర్ణింపఁబడిన విధముగ నుపదేశ మొనర్చినవారు, దాని గ్రహించినవారును, ఆచరిత్రమును మిగుల నాదరముతో గ్రహించినవారును, గృతిపతియును, ఉత్తమోత్తములై యుండుటచే నేను రచింపఁబోవు కావ్యము పరమపవిత్ర మైనదియు లోకులకు క్షేమము కలిగింపఁజాలినదియుఁ గాఁగలదు. మోక్షేచ్ఛ గల ప్రతిమనుజుఁడును సదా దీని నాకర్ణించుచుఁ బఠించుచు దీని యర్థమును మననము సేయుచు దీనికంటె నుత్తమమైనది మఱియొకటి లే దని ప్రశంసింపఁగలరు. దీనికి సంశయములేదు.

వ. అని విచారించి సంతోషభరితచిత్తుండ నై మదీయాచార్యపరంపరావతారంబు నభివర్ణించెద.

టీక. అని = పైనఁజెప్పినవిధముగ, విచారించి, సంతోషభరితచిత్తుండను ఐ = సంతోషముచేఁ బూర్ణ మగుమనస్సు గలవాఁడ నై, మదీయ...అవతారంబున్ - మదీయ= నాసంబంధముగల, ఆచార్య = గురువులయొక్క, పరంపరా = వరుసయొక్క, అవతారంబున్ = క్రమమును, అభివర్ణించితిన్ = వర్ణించితిని. (గ్రంథారంభమునకు ఉపక్రమించితి నని భావము.)

తా. పైన వర్ణించిన విధముగా నామహాభాగ్యమును గూర్చియుఁ గావ్యముయొక్క మహాత్మ్యమును గూర్చియు విచారించి మిగుల సంతోషముతోఁ దత్ క్షణమే కావ్యము నుపక్రమించి దానిమొదట నలంకారంబుగ నాగురుపరంపరను వర్ణింప నారంభించినాఁడను.

——♦♦♦♦§గురుపరంపరాభివర్ణనము§♦♦♦♦——

అవ. వంశము రెండు విధములు :- విద్యావంశము, జన్మచేఁగలుగువంశము. అందు శరీరమును మాత్ర మొసంగఁగలజన్మవంశముకంటె సర్వవ్యవహారసాధన మగుజ్ఞాన మొసంగిన విద్యావంశ ముత్తమ మను నభిప్రాయమును సూచించుచు కవి మొట్టమొదట గురుపరంపర నభివర్ణించుచున్నాఁడు:-

శా. సత్తామాత్రుఁడు నిర్విశేషుఁడు తనూసర్వేంద్రియప్రాణహృ
    చ్చిత్తాహంకృతిధిప్రకాశకుఁడు సచ్చిత్తోషకాయుండు వి