పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



నందందు వాచవికందువ లగు గుండె
కాయలన్నియు నూరుఁగాయలు గను
గండలు తక్కిన కజ్జాలుగాఁ గూర్చి
ఢాకినీగుణము లనేకరుచులఁ
గీ. బొట్ట కొలఁదిగఁ ద్రావుచు భూతములకుఁ
జవులు సూపుచు నేఁటి యుత్సవముఁ బోల
నొండు లేదని పొగడుచు నుల్లసిల్లి
సోలి యాడంగఁ జొచ్చె నచ్చోటఁ గలయ. 159

క. ఆ వేళఁ జిత్తముల వీ
రావేశము పొదలఁ బోటు లాడఁగఁ దమకున్
దైవసహాయము లేమిని
భూవల్లభుసేన లెల్లఁ బొలియఁగఁ జొచ్చెన్. 160

ఆ. రథము లంత వితథరథికసారథులయ్యె
గుఱ్ఱములును బాఱి గొఱ్ఱెలయ్యెఁ
గాలుబలము లపుడు కాలుబలములయ్యె
గజము లెల్లఁ బోర నజములయ్యె. 161

క. కాలము చేరిన వానికి
నేలయుఁ బగ యనఁగ మింట నిలిపిన బలముల్
బాలునిఁ గూడుక యా భూ
పాలుని సైన్యముల నేలపాలుగఁ జేసెన్. 162

శా. శుండాలాది బలంబు లిట్లరిగినన్ క్షోణీశ్వరుం డొక్కఁడుం
జండీశుండును గాలకర్మము నిజేచ్ఛం ద్రోవలేఁ డంచు ను
ద్దండాస్త్రుండయి శాలివాహనునిచేతన్ దండకాష్ఠాహతిన్
ఖండీభూతశిరస్కుఁడై యెగసి మ్రగ్గంజెల్లె నుజ్జేనిలోన్. 163