శ్రీరస్తు
సింహాసన ద్వాత్రింశిక[1]
ప్రథమాశ్వాసము
___కృత్యాది, దేవతాస్తోత్రాదికము___
శా. శ్రీమత్పర్వతనందనీ[2] తనులతాశ్లింష్టాంగ మై బాహుశా
ఖామధ్యంబున నున్న పన్నగఫణౌఘం బాకు లై యొప్ప ను
ద్ధామం బౌ శశికాంతి పుష్పరుచి నొందంగా జటాపల్లవ
స్తోమం బౌ హరపారిజాతము భజింతు[3] న్వాక్ఫలావాప్తికిన్.
చ. పులుఁగులపెద్ద వారువము, పోటరి బిడ్డఁడు, ఱాఁగరౌతు,[4] పా
ములగమికాఁడు సెజ్జ, నలుమోములవాఁ డిలుతీర్చుపట్టి, వే
ల్పులు బలుబంటు, లాకలిమి[5]పొల్తుక, తెల్లనితల్లి పెద్దకో
డ లనుచు నెల్లవారుఁ బొగడం దగు నల్లనివేల్పుఁ గొల్చెదన్. 2
ఉ. దక్షిణనేత్రకాంతి నుచితంబుగ నర్థవికాస మొంది వా
మాక్షిరుచిప్రసారమున నర్థము విప్పకయున్న పుండరీ
కాక్షుని నాభిపద్మనిలయంబునఁ దుమ్మెదభంగి లోలుఁడై
యక్షయవేదనాదమయుఁడైన విరించిఁ దలంచి మ్రొక్కెదన్. 3
ఉ. కట్టినపట్టపుం దనువు గద్దియతమ్మియ నక్షమాలయుం
బట్టినచిల్కయు న్నగవుఁ బాపటజల్లియు నొక్కవన్నెగాఁ
బుట్టుచుఁ బుట్టువిద్యలకుఁ బుట్టినయి ల్లనఁజెల్లి బ్రహ్మవా
కట్టొనరించిన తన్ముఖవికాసినియౌ సతి మమ్ముఁ గావుతన్. 4