పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

lvi



నేతిబీఱకాయ నీతి గాకుండఁగ
నిన్నివిద్యలందు నెన్నఁబడ్డ
సార్థనాముఁడైన యర్థిగా నెఱుఁగుము
విబుధ పంకజార్క; విక్రమార్క. (2-47)

ఈ పద్యము నందలి చమత్కారము ఆశ్చర్యము కలిగించును. ఒక కవి పేరు ఆరక్షరములు గలది. అందులో మొదటి అక్షరము తీసివేసిన ఆశ్వవేది అగునట. రెండక్షరములు తీసిన నాట్వకర్త అగునట. మూడక్షరములు తీసిన గతమెరిగిన వాడట. నాలుగక్షరములు తీసిన చాలనేర్పరి అట. అయిదక్షరములు విడిచిన పండితుడట. అన్ని అక్షరములు కలిపిచూచిన మహాబుద్ధిశాలి యగునట. అతని పేరేది? 'చతురంగతజ్ఞ' అన్నది అతని పేరు. పైన చెప్పినట్లు ఒక్కొక్క అక్షరము తీసిచూడుడు. ఇట్టిదే మరొకటి,

సీ. రాజ్యంబు వదలక రసికత్వమెడలక
           జయశీల ముడుగక నయము చెడక
   దీనులఁ జంపక దేశంబు నొంపక
           నిజ ముజ్జగింపక నేర్పు గలిగి
   విప్రులఁ జుట్టాల వెన్నుసొచ్చినయట్టి
           వారిని గొల్చినవారిఁ బ్రజల
   హర్షంబుతోఁ గాచి యన్యాయ ముడుపుచు
           మున్ను జెప్పిన రీతిఁ జెన్నుమీఱి

   చేత లొండులేక ప్రాఁతల విడువక
   యశము కలిమి దమకు వశము గాఁగ
   వసుధ యేలు రాజవర్గంబులోన న
   య్యాది విష్ణుమూర్తి వండ్రు నిన్ను. (7-75)