పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

liv


మిశ్రమము :

శా. కాయజొచ్చెంరసాలముల్ విరహులాకంపింపఁగాఁ గోయిలల్
   గూయంజొచ్చె మనోజదిగ్విజయ మాఘోషించుచుం దుమ్మెదల్
   మ్రోయంజొచ్చె నవీన పుష్పశరముల్ మొత్తంబుగాఁ జిత్తజుం
   డేయంజొచ్చె సతు ల్మదిం గలఁగగా నెచ్చోటులం దానయై. (7-12)

క. కలకల బలికెడు పక్షుల
   కలకలములు సకలదిశలఁ గలయఁగఁ బొలయం
   దళదళికులముగ దశశత
   దళదళములు విరియఁ బ్రొద్దు దళతళఁ బొడిచెన్. (1-28)

కృతులలో అష్టాదశవర్ణనలుండవలెనని లాక్షణికులు చెప్పిరి. గోపరాజుకూడ చెప్పెను.

క. కావునఁ బదునెనిమిది యగు
   నీ వర్ణన లచట నచట నించుక బెరయం
   గావించెద నిటఁ బనికిని
   రావనకుఁడు లక్షణాభిరామములగుటన్. (1-38)

ఈ కావ్యమునందలి అష్టాదశవర్ణనలను విస్తరభీతిచే ఉదాహరింపక విడుచుచున్నాను. సహృదయులు పరిశీలింప గోరెదను. గోపరాజునకు సంయమము తక్కువ. వర్ణనాలోలుడగుట అతని స్వభావము. పలుచోట్ల ఈ వర్ణనలు కథాగమనమునకు అడ్డు తగులుచుండును. ఆనేక వర్ణనలలో ప్రాచీన కావ్యచ్ఛాయలు, అనుకరణములు గోచరించును.

“పల్లవ వైభవాస్పదములు పదములు" (భాగవతము)
“పల్లవ సంపదాస్పదములు పదములు" (1-204)

క. సరి దావచ్చిన వచ్చును
   సరసంబుగ నారికేళసలిలము భంగిన్ (సుమతిశతకము)