పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/537

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

478

సింహాసన ద్వాత్రింశిక


తమ్మునఁ గలఁగక నాకీ
సొమ్మి చ్చెను గురుఁ డటంచుఁ జూపుము నన్నున్.

50


సీ.

అనవుడు నౌఁగాక యని పురంబున కేగి
        యంగడి నమ్మఁజూపంగ నొకతె
మనపాప సొమ్మని మంత్రికిఁ జెప్పిన
        నాతఁడు సొమ్ముతో నతనిఁ బట్టి
పృథివీశుముందఱఁ బెట్టిన గలుషించి
        చెప్పరా యిది యెట్టు చేరెననిన
నే మ్రుచ్చుఁగాను మీ కీజాడఁ జెప్పెద
        బంటుల నావెంటఁ బనుపు మనుచుఁ


ఆ.

గొందఱారెకులను దోడుకొనుచు వచ్చి
నాకు సొ మ్మిచ్చె నీగురునాథుఁ డనుచుఁ
జూప వారలు మదిఁ గడుఁజోద్య మంది
యట్టివేషంబునకు సంశయంబు నొంది.

51


క.

ఓగురునాయక యీ సొ
మ్మేగతి నినుఁ జేరెఁ జెప్ప నే తెమ్మనినన్
జోగులము మేము మాకట
రాఁగూడదు గాన రాజు రమ్మనుఁ డిటకున్.

52


క.

అతనికిఁ జెప్పెద మనపుడు
నతివేగమ యేగి వార లటు వినిపింపన్
క్షితిపతియును మతి నతివి
స్మితుఁడై చనుదెంచి కపటసిద్ధుని మ్రోలన్.

53


క.

వినతుఁడై యున్న యాతని
గనుఁగొని నీవీట దంతఘట్టకుసుత డా