పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/536

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వాదశాశ్వాసము

475


నకట నాయున్కిఁ జెప్పక యుండనైతిని
        తమమీఁది చిత్తంబు దరలుఁ గాన
సతు లిష్టుచెలికాని సైతురె నాకును
        విషమువె ట్టిది దొడ్డ విందువనిచెఁ


ఆ.

జూడు మనుచు నతఁడు శునకంబునకుఁ బెట్టె
నదియుఁ దినుటతడవె యవనిఁ గూలె
నెదిరివారిచిత్త మెఱిఁగి వర్తించెడు
వారికేల కీడు వచ్చునురక.

46


వ.

ఇట్లు దృష్టాంతంబు చూపి నీవింక గూఢంబున నేగి యతనికి భోజనంబు వెట్టితి నని చెప్పి మధుపానమత్త యగు నమ్మత్తకాశినికి లోఁదొడ గోరునాట మూఁడుపోటులు వరుసం బొడిచి పాదభూషణమ్ము గొని రమ్మిటఁ గార్యంబు చూచుకొంద మని యనిపిన నతండు సని యాక్రమం బొనరించి యందియఁ గొని వచ్చిన.

47


ఉ.

అక్కడ మాని తత్పురి యుపాంతమున న్మసనంబులోన గో
రక్కుఁడు మీననాథుఁడు ధరం జరియించుచు విశ్రమార్థమై
యిక్కడ నిల్చినారొ యన నిద్దఱు నుధ్ధతి సిద్ధవేషులై
యొక్కమఠంబు గట్టుకొని యుండిరి శూలము కేలఁ గ్రాలఁగన్.

48


క.

ఒకనాఁ డటు కర్ణోత్సలు
నికొడుకు మృతుఁడైన నెఱిఁగి నీతివిదుఁడు మం
త్రికుమారుఁడు నృపసుతుచే
తికి నూపుర మిచ్చి సంతఁ ద్రిప్పఁగఁ బనిచెన్.

49


క.

అమ్మెద నని చూపుము తెగ
నమ్మకు మఱి దీనిజాడ లడిగిన నీచి