పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/535

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

474

సింహాసన ద్వాత్రింశిక


శా.

ఆసౌధాంతరసీమ రత్నమయపర్యంకంబుపై నుండి త
ద్దాసీలోకకృతోపచారుఁ డగుచుం దాంబూలపుష్పాదు లు
ల్లాసం బంది చెలంగి కైకొనుచు బాల న్సిగ్గుదేఱం బరీ
హాసోక్తిం బరికించి రాకొమరుఁ డేకాంతబునం బ్రోడయై.

41


క.

తలఁపునకంటెం గడు న
గ్గల మగుతమకమున బాలఁ గౌఁగిట నిడి మైఁ
బులకలు మొలవగఁ దలకొని
చులుకగ రతిసుఖము చవులుచూపుచుఁ గవసెన్.

42


ఉ.

ఈగతిఁ బెక్కునాళ్ళు సుఖియించుచు నుండి విదేశభూమిలో
నేగతి నున్నవాఁడొ తన యిష్టసఖుం డని యిచ్చలోనఁ జిం
తాగతుఁ డైన దీనికిఁ గతం బిట నేటిది చెప్పు మన్న నా
త్మాగమనంబుఁ దన్మతియు నాతని యున్కియుఁ జెప్పె నేర్పడన్.

43


క.

అది విని నీకాప్తుఁడు నా
హృదయస్థితి యెఱుఁగు జాణ డీక్రియ దాసీ
సదనమున నొగులుచుండఁగ
నది యేలా చెప్ప నాతఁ డాప్తుఁడు గాఁడా.

44


క.

అతనికి విం దొనరింపం
జతురుఁడు నను మెచ్చుఁ బాయసముఁ బక్వాన్నా
న్వితముగ ఘృతముం గొని చని
యతిముదమునఁ బెట్టి యింటి కరుదెమ్మనుచున్.

45


సీ.

ఆపదార్థములు రయమ్మున సమకూర్చి
        యాత్రాడు వెంటనే యనుప నతఁడు
చని ద సిగృహమునఁ దనయిష్టసఖుఁ గాంచి
        బాలిక యిదె విందు పనిచె ననిన