పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/527

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

408

సింహాసన ద్వాత్రింశిక


క.

జననుతుఁడు క్షాంతిశీలుం
డనఁగా నొకభిక్షుకుండు హరిమూర్తికిఁ దా
నెనయగు భూవల్లభునిం
గనుఁగొనఁ జనుదెంచి ఫలము కానుక యిచ్చెన్.

5


క.

ఇచ్చినఁ గైకొని నృపుఁ డిటు
విచ్చేయుం డనుచు గారవించుచు నతనిన్
సచ్చరితుఁ డనుచు నాసన
మిచ్చి యుచితగోష్ఠి జరపి యెలమిని ననిపెన్.

6


వ.

ఇట్లనిపిన తదనంతరంబున.

7


ఆ.

ఆఫలంబు తనగృహాధ్యక్షు చేతికి
నిచ్చి లేచి లోనికేగె విభుఁడు
మఱియు నాతపస్వి మఱునాఁడు గ్రొత్తగా
నొక్కపండు దెచ్చియొసఁగెఁ బతికి.

8


శా.

ఆపండు న్నృపుఁ డట్లు పుచ్చుకొని భాండాగారిచే నిచ్చె ని
ట్లేపార న్ఫలహస్తుఁడై యవసరం బీక్షించుచు న్భిక్షుకుం
[1]డేప్రొద్దుం గవితావిలాసమున నర్కేందు ప్రతీకాశుఁడౌ
క్ష్మాపాలుం గొలువంగ నయ్యె దశవర్షంబు ల్వినోదంబుగఁన్.

9


చ.

అటు లొకనాఁడు క్రొత్తఫల మాతఁడు దెచ్చిన బెంచినట్టి మ
ర్కటమున కిచ్చె నాకపియుఁ గైకొని మూర్కొని చూచి మెచ్చుచుం
గటుకనఁ బండలం గొఱుకఁగా నొకరత్నము గింజమాడ్కి ముం
దటఁ బడియె న్నిజప్రభలఁ దద్గృహమండప మర్కువన్నె గాన్.

10


సీ.

ఆరత్న మీక్షించి యాశ్చర్యమున విభుఁ
        డట గృహాధ్యక్షుఁ డైనట్టి లెంకఁ

  1. డేపారం గనరానివేషమున లంకేశప్రతీకాశుఁడై