పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/514

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశాశ్వాసము

453


బున విడిసి యనుచరులుఁ దా
నును నదికిం జనియె నిజమనోరథ మలరన్.

125


మ.

చని యాతీర్థములో సచేలముగ సుస్నానంబు గావించి నూ
తనవస్త్రాభరణానులేపముల గాత్రం బుజ్జ్వలస్ఫూర్తి గై
కొని రాజిల్లఁగ నిల్చి విప్రపరులన్ గోభూతిలార్థాదిదా
ననిరూఢం దనిపె న్రవిగ్రహణపుణ్యంబైన కాలంబునన్.

126


క.

కొంకక యిచ్చుచు వెలువడి
శంకరుఁ గింకరమనోవశంకరు నురగా
లంకారు నచట నిలిచిన
యోంకారేశ్వరుని గొలిచె నుచితార్చనలన్.

127


మ.

భువనాధీశ్వరు నిట్లు తత్పరమతిం బూజించి సేవించి త
ద్భవనప్రాంగణరత్నమండపములోఁ బర్యంతభూమీశులుం
గవులు న్బట్టులు గానవేత్తలు నలంకారజ్ఞులు న్మంత్రులు
న్యువతీస్తోమము లెంకలుం గొలువఁగా నుల్లాసియై యుండఁగన్.

128


మ.

ఒకవైతాళికుఁ డేగుదెంచి సభలో నుక్షిప్రహస్తాగ్రుఁడై
ప్రకటాశీర్వచనక్రమంబున నిజప్రౌఢత్వ మేపార గా
నకళాభిజ్ఞత చూపఁ బూని పలికెన్ క్ష్మాకాంత నీకీర్తికాం
తరు నీరేడుజగంబు లొక్కమణిసౌధంబై వెలుంగుంగదా.

129


ఉ.

ఓనరనాథచంద్ర సుగుణోత్తమ యిచ్చట నాప్తవర్గమున్
దీనుల బట్లను న్ధరణిదేవతలం గవులం బ్రియోక్తి స
న్మానము లేర్పడంగ ననుమానము సేయక యాదరించు నీ
దానమహోత్సవంబు విని దవ్వులనుం డిదె చూడవచ్చితిన్.

130


ఆ.

అర్థినన్న మెత్తు వటుగాక నేర్పరి
నన్న మెచ్చువడయు టదియ కడిఁది