xlviii
చెప్పెను. అన్నిటికిని ఉదాహరణములను చెప్పి తన సామర్థ్యమును చూపుటకై సర్వప్రాస కందమును చెప్పినాడు.
క. కుండలి బాలకులకు నధి
కుండగు భుజగేంద్రనాయకుండటు మెచ్చం
గుండ యమృతంబు నేఁడీ
కుండఁగఁ దగదనుచుఁ దప్పకుండఁగ నిచ్చెన్.” (9-139)
గోపరాజు వలపలగిలక ప్రాసమున గూడ పద్యము చెప్పినాడు.
శా. కాశ్యపిలోఁబ్రసిద్ధమగు కంచిని నుండుదు విష్ణుశర్ముడం
గశ్యపగోత్రజాతుఁ డ, వికార విదూరమనస్కుఁడన్ జగ
ద్వశ్యకళావిశారదుఁడ, దైవము చెయ్ది దరిద్రభావనా
కార్శ్యమునొంది ఖార్య గడుఁ గష్టపుఁ బల్కులు వల్కనోర్చితిన్. (8-206)
ఇట్టిది 'సంయుక్త విశేషప్రాస' కాదగునని శ్రీ రావూరి దొరస్వామి శర్మగారు చెప్పిరి. [1] గోపరాజు, ప్రమాదమున గావచ్చును ప్రాసభంగమును చేసినాడు.
"నీ కే వాంఛయు లేకయున్న వినుమా నిన్నెవ్వఁడీక్షించినన్
మాకిష్టంబు సరస్వతీవిభవ మామర్త్యుండు వే పొందు వా
క్ప్రౌఢుండై విలసిల్లఁ జేసెదము భూపాలాగ్రణీ నీయశం
బాకల్పంబుగ నొప్పుఁగాత జనలోకానందమై సాంద్రమై." (12-106)
ఇందలి మూడవపాదమును “వాక్ఛ్రీకుండైవిలసిల్లఁ జేసెదము ధాత్రీనాయకా"అని సవరింప వచ్చును; కాని స్వతంత్రించుట న్యాయముకాదు.
- ↑ అప్పకవీయ భావప్రకాశిక.