పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/470

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమాశ్వాసము

409


ననుఁడను జావఁగోరి యిట వచ్చి తి దేమని చెప్ప నావుఁడు
న్మనమున నిట్టితెం పుడుగుమా యని రాజు కృపార్ద్రచిత్తుఁడై.

71


క.

నే వేఁడినకోరుకు లివి
గా వనఁగారాదు గానఁ గారుణ్యముతో
నీవిప్రుని రక్షింపను
దేవీ పొమ్మనుచుఁ గామధేనువు నిచ్చెన్.

72


ఉ.

ఇచ్చి నభఃస్థలంబున సురేశ్వరుఁ డాదిగ దేవసంఘము
ల్మెచ్చఁగఁ దొంటిమార్గమున మిక్కిలి వేడుకతో నవంతికి
న్వచ్చె నృపాలుఁ డిట్టి గుణవైభవ మింకిటఁ గల్గెనేని నీ
విచ్ఛట వచ్చు టొప్పు మనుజేశ్వర యుక్తము నీ వెఱుంగవే.

73


క.

నావుడు విని యుజ్జయినీ
భూవల్లభుసద్గుణములు పొగడుచు హితులన్
సేవకుల వీడుకొని భో
జావనివల్లభుఁడు నిజగృహంబున కరిగెన్.

74


వ.

మఱియును గతిపయదినంబులు జరిగిన.

75


ఇరువది యేడవ బొమ్మకథ

క.

అక్రూరవరదు రణరం
గక్రీడాశమితవిమతుఁ గమలారమణుం
జక్రీశ్వరపర్యంకుని
జక్రాయుధభరణు దుగ్ధసాగరశాయిన్.

76


మ.

అతితాత్పర్యమునం దలంచుచు నిలింపాధీశభద్రాసన
స్థితికై సంపద పెంపుమీఱఁగఁ గృతాశీర్వాదభూనిర్జరా
న్వితుఁడై భోజవిభుండు డగ్గఱునెడ న్వీక్షించుచున్న న్సప్తవిం
శతమద్వారము నొద్ద బొమ్మ సుజనాశ్చర్యంబుగా నిట్లనున్.

77