పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/447

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

386

సింహాసన ద్వాత్రింశిక


నాత్మజాతి కుచితమైన సంస్కారంబు
నడపి తద్దినములు గడపి పిదప.

103


క.

సుముహూర్తంబున నామం
చముకోడులక్రిందఁ ద్రవ్వి చరువులలోఁ జి
ట్టుముకయు మన్నును బొగ్గులు
నెముకలు వేర్వేఱఁ జూచి హృదయము లులికెన్.

104


మ.

భువిలో డాగఁగఁ జేసి రాగిచరువు ల్పూరించి యీతుచ్ఛవ
స్తువు లేలా మనయయ్య డాఁచె ధన మిచ్చోఁ బెట్టఁడో కాక బు
ద్ధివినాశం బతఁ డొందె నొక్కొ మనలో దృష్టించి యెవ్వాఁడొ దొం
గవిధం బచ్చుగఁ ద్రవ్వి చేకొనియెనో కా కంచుఁ దర్కించుచున్.

105


ఇచ్చోట రెండు పద్యము లర్థము కాకున్నవి.


క.

అయ్య పనిగాదు దాసులు
నియ్యెడ దృష్టింపనేర రెవరుం జొరలే
దయ్యముగా నా కెంపులు
దయ్యము గొఱయించెననుచుఁ దలపోఁతలతోన్.

106


క.

మాలో నమ్మకయును నొక
పాలుం దేలకయు బహుసభాస్థలముల నీ
మూలములు చెప్పి విసిగితి
మేలాగున నైన నిర్ణయించు నృపాలా.

107


వ.

అని విన్నవించిన సుముహూర్తమాత్రప్రయాణోన్ముఖుండు గావున ధర్మాధికారులను మంత్రులను బిలిపించి దీని నిర్ణయింపుఁ డని యప్పగించి విక్రమార్కుండు కొన్నిపయనంబులు భట్టి సహాయుండుగాఁ జనిన.

108