పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/429

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

368

సింహాసన ద్వాత్రింశిక


దిరిసెంబులఁ గలిగొట్లం
బరువం బేర్పడఁగ సుష్ఠపవనము వీచెన్.

8


క.

మండెడుమార్తాండద్యుతి
నెండను నొండొండ నెఱియ లేర్పడగా భూ
మండలము పూర్వమున నవ
ఖండము లయ్యును ననేకఖండము లయ్యెన్.

9


క.

ఉదకముఁ గసవును నీడలు
మొదలాఱఁగఁ దలకు మృగసమూహంబులయా
పద లెఱిఁగి యిఱ్ఱి యమృతా
స్పదమై కడుఁ జల్లనైన చంద్రునిఁ జేరెన్.

10


ఆ.

కార్య మయ్యెడునెడ గర్వంబు పూనక
కాలమహిమఁ దన్నుఁ గాచికొనుట
యుచిత మనుచు వెట్ట కోర్వక చలువకై
యత్తవారిఁ జేరె నచ్యుతుండు.

11


క.

తొడిగినపాముల విసమును
మెడవిసమును నొసలిచిచ్చు మెట్టులవడయున్
ముడివడఁగా వడకాలము
గడపుట కడుఁ గడిఁది యయ్యె గరకంఠునకున్.

12


క.

చల్లనిగంగాజలమును
జల్లనిచందురుని గూడ జడలం దిడి తాఁ
జల్లనికొండకు నాశివుఁ
డల్లుండై కొంత బ్రదికె నావేసవిలోన్.

13


ఆ.

అమృతశీతలాంశు వగువార్ధిలోనున్న
పద్మనాభునాభిపద్మగృహము