పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

346

సింహాసన ద్వాత్రింశిక


క.

అనినఁ దనయిచ్చ నిష్టం
బొనరింపఁ గడంగి యోగి యొక నిడుబలపం
బును లాతము బొంతయు గ్ర
క్కున నాతని కిచ్చి వాని గుణములు చెప్పెన్.

112


వ.

ఈ బలపపుఁగొడుపున వలసినయన్ని లెక్క లొడ్డి వ్రాసి యీలాతపుఁగోల సవ్యహస్తంబునఁ బట్టి ముట్టించిన నన్నియు నీవు దలంచిన ప్రాణులై నిల్చి నీవు సెప్పిన పని సేయు; నవి యుడుపవలసిన నెడమచేత నావ్రాఁతలు క్రమంబునం దుడిచిన నడంగు; నెచట నైన నీబొంత దులిపినఁ గోరినయంతధనంబు నీ కిచ్చు నరుగు మని వీడుకొల్పిన.

113


ఉ.

మ్రొక్కి వినీతుఁడై మగిడి ముందట ఘోరము లైన పాములం
ద్రొక్కుచుఁ గంప లీరములుఁ దూఱుచుఁ గాఱడవి న్మనంబులో
స్రుక్కక మార్గము ల్గడచుచుం గడుదూరము వచ్చి భూవరుం
డొక్కెడఁ గాష్ఠము ల్విఱుచుచున్న మనుష్యుని గాంచె ఖిన్నునిన్.

114


ఆ.

వానిఁ జూచి యేల వగచెదు కట్టెల
కింతదవ్వు రాఁగ నేమికతము
నావుఁ డేను హూణనరపతిబంటఁ ద
త్పుత్రుతోడఁ జావఁ బూనినాఁడ.

115


ఆ.

ఆకుమారుఁ డగ్ని నదె పడుచున్నాఁడు
చూడు మనినఁ గెలన సొద యొనర్చి
చిచ్చు వెట్టి కూల నిచ్చగించెడువానిఁ
జేర నేగి రాజశేఖరుండు.

116


క.

నరవరసుత! నీ కీదు
ర్మరణమునకుఁ బూననేల మదిలోపల నే