పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

337


ఆ.

యిది సువర్ణదాయి యిది జరామృత్యుని
ర్హరణ మనుచు రసరసాయనములు
పేర్మి నిచ్చి యనిపె బిలమార్గ మెఱిఁగింప
నవ్వరాహమైనయసురఁ బనిచె.

63


ఉ.

పంచిన, వాఁడు చేరి జనపాలక యీమొగసాల గాచి న
క్తంచరవైరి యన్యులకుఁ గానఁగరాక వసించు, నట్టిరా
త్రించరనాయకుండు నినుఁ దెమ్మని పుచ్చిన నేకలంబనై
వంచనఁ దెచ్చి యిన్ని దురవస్థలఁ బెట్టితిఁ దప్పుసైఁపుమీ.

64


ఉ.

దానవనాథుఁ జూచితి సనాతనమౌ రససిద్ధిఁ గంటి వో
మానవనాథ నాపని క్రమంబున నీహిత మయ్యె నంచు స
న్మానముతోడఁ గొల్చి బిలమార్గము సూపఁగ వచ్చి వెల్వడ
న్వాని నతండు వీడ్కొలిపి వార్వము నెక్కె నుదాత్తచిత్తుఁడై.

65


చ.

మగిడి మహామృగౌఘము నమానుషభూములు నిర్ఝరంబులు
న్నగములుఁ గంటకద్రుమనంబులు దాఁటుచు వచ్చి యాత్మభృ
త్యగణము రోయుచున్ జనపదంబును గానక కానలోన నా
మృగయునిఁ గాంచి యొయ్యన సమీపముఁ జేరఁగ వాఁడు మెచ్చుచున్.

66


క.

మనుజేంద్ర నీవు క్రోడము
వెనువెంటం జనిన నిన్ను వెదక బలంబుల్
గనుకని చనియె న్నే నొక
యనువునఁ దురగంబుజాడ యరసెద నిచటన్.

67


క.

కంటిఁ బని చెల్లె ననుచుం
గంటకములుఁ గండ్లు దప్పఁగాఁ దోడ్కొని రా
జొంటిపడకుండ మృగయుఁడు
బంటుతనము మెఱసి యొక్కబయలికి దెచ్చెన్.

68