పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

334

సింహాసన ద్వాత్రింశిక


పులవింటికి జడియుచు మరు
నిలువేలుపుగా భజింతు రింతులుఁ దారున్.

50


ఉ.

ఆపురిఁ గాంచి సమ్మదము నచ్చెరువు న్మదిఁ బిచ్చలింపఁగా
భూపవరుండు పంది యెటువోయె బలం బెటు వోయె దివ్యమౌ
నీపుర మెట్లు తోఁచె నది యెవ్వనిరాజ్యమొ చూత మంచు ని
చ్ఛాపరతంత్రుఁడై గవనిచక్కటి దగ్గఱ వచ్చె నయ్యెడన్.

51


ఉ.

చేతఁ బసిండిబ్రద్ద విలసిల్లఁగ నొక్కఁడు వచ్చి మ్రొక్కి పృ
థ్వీతలనాథ నాథుఁ డగు విష్ణునిచే సెలవంది దానవ
త్రాత బలీంద్రుఁ డిప్పు డనురాగమున న్నినుఁ బిల్వఁ బంచె ర
మ్మా తడయంగ నేల యనుమానము సేయక నీవు నావుడున్.

52


సీ.

ఘనుని సందర్శింపఁ గలిగె నిక్కడ నని
        యానంద మందుచు వానిఁ జూచి
పురిచొచ్చి రత్నమందిరములసొం పెల్ల
        గోరి చూచుచుఁ బైఁడికోట దాఁటి
చని యవ్వటారుమోసలఁ దూఱి మణిమండ
        పంబులో దైత్యులు బలసికొలువ
గంకణంబులమ్రోఁత గల్లనఁగాఁ బాఁప
        జోటులు పసిఁడి వీచోపు లిడఁగ


ఆ.

మెఱుఁగుముత్తియములపేరు లఱుత మెఱయ
నలరుచుక్కలలోని రేవెలుఁగువోలె
మానికంబులగద్దియపైని దీర్చి
యున్న బలిఁ జూచి మ్రొక్కె నమ్మన్నుఱేఁడు.

53


క.

అతనిఁ గనుంగొని దానవ
పతి ప్రియమునఁ గౌఁగిలించి భద్రాసనసు