పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

333


లొంక సొచ్చె నాత్మఁ గొంకక కాలుండు
కదిసి దివియ వట్టి వెదకుపగిది.

44


ఉ.

చొచ్చి మహామృగం బరుగుచొ ప్పటఁ గానక కందరాంతని
ర్యచ్చటులాంశకూట మగు రత్నకవాటము గాంచి యిచ్చలో
నచ్చెరువంది యందుఁ జని యావల నిండిన చిమ్మచీఁకటిం
గ్రొచ్చుచు నేగె వాలు కడక్రొమ్మెఱుఁగు ల్నిగుడంగఁ గ్రిందికిన్.

45


ఉ.

ఆదెసఁ గొంతదవ్వుల మహారజతాంచితసాలమండల
శ్రీ దనరార రత్నకలశీపరిచిహ్నితతుంగశృంగసౌ
ధాదినికేతనప్రసర మైన మహానగరంబు దోఁచెఁ జం
ద్రోదయలీలఁ గన్నులకు నుత్సవమై దిమిరం బడంచుచున్.

46


ఉ.

అందుల పణ్యవీథుల నహర్నిశముం దిమిరంబు లీను సం
క్రందనరత్నగేహముల కాంతుల నేగఁగరా దటంచు న
మ్మందరసీమలందు గరిమంబున దాఁచిన పద్మరాగముల్
క్రందుకొనుం బ్రదీపములకైవడి దివ్వెలపండుగో యనన్.

47


క.

అందు బలిచక్రవర్తి ము
కుందుఁడు దనద్వారపాలకుఁడుగా రక్షో
బృందములు గొలువఁగా నా
నందంబున నుండు నురగనాథులతోడన్.

48


క.

అందుల ఫణికుల ముపవన
చందనసంవేష్టనిజభుజంగీవదనా
నందనసుండరతరమగు
మందానిల మానుచుండు మ్రాన్గ న్నిడుచున్.

49


క.

చెలువారెడు నాపురిలో
పలి రక్కసు లొండుగడల భయ మెఱుఁగక తీ