పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

325


దేజులఁ జామరంబులను [1]దెల్లని యెల్లుల నేపు సూపుచున్
రాజును మంత్రులు న్సుకవిరాజులు నుండుదు రొక్కకైవడిన్.

5


ఆ.

అట్టిదివసముల సమస్తభూపాలురు
భటులుఁ గవులు హితులు బలసి కొలువ
సురగణంబులోని సురరాజుభంగి న
య్యవనిపాలుఁ డున్నయవసరమున.

6


క.

ముకుళితకరుఁడై దౌవా
రికుఁ డెదుర న్నిలువఁబడి ధరిత్రీశ్వర! కా
నికగా సాళువముం గొని
యొకనల్లనిచెంచు వచ్చియున్నాఁ డనుడున్.

7


క.

తత్కారణంబు దెలియ స
ముత్కంఠుండై[2] నిజాభిముఖమానవసం
పత్కరదర్శనుఁ డగు డూ
భృత్కులతిలకుండు వానిఁ బిలువం బంచెన్.

8


మత్తకోకిల.

నెమ్మిఁ బచ్చని కుప్పసంబును నీలిచీరయుఁ బీలియుం
దమ్మిపూసలపేరు నెఱ్ఱనిధాతుబొట్టును జూడ నం
గమ్ముపైఁ దగు సొమ్ముగాఁ బిడికత్తి కాసె నమర్చి పా
ఱమ్ముల న్విలుఁ గేలఁ బూన్కొని యంతఁ జెం చరుదెంచుచున్.

9


క.

దూరంబున నుడుగణపరి
వారుండై వెలుఁగు రజనివల్లభుక్రియ ను
ర్వీరమణులలో నొప్పెడు
నారాజుం జూచి మ్రొక్కి యతివినయమునన్.

10
  1. దేటయి నీటయి నేటు జూపుచున్
  2. ముత్కలికుండై