పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

319


లనలీలాకృతడఁంబరాంబరతలాలంబోష్ణరుగ్బింబచుం
బనవిస్రంభవిజృంభితాద్భుతరసప్రారంభమున్ స్తంభమున్.

130


సీ.

కని విస్మితుం డౌచుఁ జని హేమగృహముల
        రత్నగోపురముల రమ్యమైన
పురము డగ్గఱి దాని పొంత సూర్యప్రభ
        నానొప్పు నేఁటిలో స్నానమాడి
గుడిలోని యాదిత్యుఁ గడుభ క్తిఁ బూజించి
        యిష్టదైవముఁ బరమేశుఁ గొల్చి
యుపవాస ముండి సముత్సుకుఁడై దేవ
        తాయనమున నారేయి గడిపి


ఆ.

రేపకడన లేచి పాపవినాశన
తీర్థమునకు నేగి పార్థివుండు
జలకమాడి యచట సంధ్య నారాధించి
జలజమిత్రు నాత్మఁ దలఁచునపుడు.

131


ఆ.

తెలివిపడఁగ మొదలి దిక్సతి కెత్తిన
గొడుగుమీఁది పసిఁడిగుబ్బ యనఁగఁ
దూర్పుకొండమీఁదఁ దోఁచె మార్తాండుని
మండలంబు భువనమండనంబు.

132


ఆ.

తీర్థమధ్యమమున దివ్యపీఠాంకమై
జిగి దొలంక బుగ్గ లెగయుచుండ
నవ్యమైన కనకనాళంబు గల మహా
కమల మనఁగఁ బుట్టెఁ గంబ మపుడు.

133


క.

కడుచోద్య మంది యీఁదిన
దడ వగు నని యాతఁ డద్భుతస్తంభముపైఁ