పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

318

సింహాసన ద్వాత్రింశిక


భీర్యంబు గలిగి నడుకొని
మర్యాదనె నీరు నిలిచి మడుఁగై యుండున్.

124


ఆ.

అచటఁ జంద్రకాంతఖచితసౌపానమై
నాల్గుదెసలఁ గాంచనంబులైన
హర్మ్యముల భజించు నఘనాశనం బనఁ
గలదు తీర్థము కడ గానరాదు.

125


మ.

విను మావింధ్యమునందుఁ బ్రొద్దున శిరోవిన్యస్తపీఠాంకమై
కనకస్తంభము పుట్టి పుట్టి యినుఁ డాకాశంబు వ్రాఁకంగఁ దా
నును చొప్పునఁ జక్కఁగాఁ బెరిఁగి భానుం జేరి మధ్యందినం
బునఁ దద్బింబము ముట్టి క్రమ్మఱు నదిం బ్రొద్దున్ దిగం జాఱఁగన్.

126


ఆ.

ఇనుఁడు గ్రుంకువేళ నిక్కడఁ దాఁ గ్రుంకుఁ
బొడుచువేళ నట్ల పొడిచి పెరుఁగుఁ
జిత్ర మిద్ది రాజశేఖర! సృష్టిలో
నలువనేర్పు చెప్ప నలవి యగునె.

127


క.

ఎన్నఁడు నిట్టి విచిత్రము
కన్నది విన్నదియు లేదు కడపట గుణసం
పన్నుని సజ్జనమిత్రు జ
గన్నుత నినుఁ గంటి ననినఁ గడుమోదమునన్.

128


శా.

తత్కాలోచితగోష్ఠి దీర్చి యతనిం దాంబూలపూర్వంబులౌ
సత్కారంబుల నాదరించి కొలువుం జాలించి యారాత్రి యు
ద్యత్కౌతూహలుఁ డౌచు ఖడ్గసహితుండై యొక్కఁడు న్భూవరుం
డుత్కోచంబున నేగె నాదెసకు నాయుగ్రాటవు ల్దూఱుచున్.

129


మ.

ఘనుఁ డట్లేగుచుఁ గాంచెఁ గాంచనమయాగారప్రకీర్ణాఘనా
శనతీర్థాంతసమున్నమన్నిజవపుస్సంభూతిహేతుప్రదా