పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

315


క.

ఆ హోమకుండమునఁ దన
దేహము వేల్వంగ నచటి దేవత లెలమి
న్సాహసము మానుపుచు నీ
యీహిత మేదేని వేఁడు మిచ్చెద మనినన్.

108


ఆ.

ఇచటి భూమిపాలుఁ డీక్రియ నిచ్చలు
మిడుకునగ్నిలోనఁ బడక మున్న
యతనియిండు లెపుడు నర్థంబుచే నిండి
యుండునట్లుగ వర మిండు చాలు.

109


క.

అనవుడుఁ గొనియాడుచు న
ట్లొనరించెద మనుచుఁ బలికి యోగిను లంతం
జనిరి నిగూఢుండై నృపుఁ
డు నవంతికి మగిడె నొక్కఁడును బెంపెక్కన్.

110


సీ.

తదనంతరంబ యాతఁడు తొంటిక్రియ వచ్చి
        యాగంబు సేయఁగా యోగమాత
లరుదెంచి నృపుని ప్రయాసంబునకు నడ్డ
        మై విక్రమార్కధాత్రీవిభుండు
తనమేను వేల్వఁ గైకొని మమ్ము మెచ్చించి
        నీయిండ్లు ధనమున నిండఁజేసె
నిచ్చలుఁ జావక విచ్చలవిడి ధన
        మెంతైన నర్థుల కిచ్చికొమ్ము


ఆ.

నావుడు నతండు దురభిమానంబు విడిచి
విస్మయంబును లజ్జయు విస్తరిల్ల
మీజఁ జూచటు తనుమీఱి మెఱసినట్టి
యతనిఁ బొగడుచు నగరికి నరిగెఁగాన.

111