పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

313


సీ.

ఒకనాఁడు కొల్వులోనికి సిద్ధుఁ డొకరుండు
        చనుదెంచి సుఖగోష్ఠి జరపునపుడు
తాపసోత్తమ నాకు దానగుణంబున
        విక్రమార్కుని మీఱ వెరవు గలదె
యనవుడు సాహసహవనంబు చేసిన
        సిద్ధించు నందుల చేఁత వినుము
యోగనీచక్రంబు నొందుకుండములోన
        నొక లక్ష గోఘృతాహుతులఁ బోసి


ఆ.

పొదలఁజేసి మేను పూర్ణాహుతిగ వేల్చి
వెనుకఁ దత్ప్రసాదముననె బ్రదికి
దానవిభవమునకుఁ దగినంత వేఁడుము
మెఱసి సాహసాంకు మీఱవచ్చు.

98


చ.

అనవుఁడు నుత్సహించి నృపుఁ డాతని వీడ్కొని రాత్రి సర్వయో
గినులఁ దలంచుచుం జని సకీలకమంత్రజపంబుతోఁ దదీ
యనిలయవహ్నికుండమున నాహుతు లన్నియుఁ బోసి తెంపునం
దనువును వేల్చె నిత్యమగు దానము దేహముకంటెఁ దీపిగాన్.

99


క.

ఆయెడ యోగిను లాజన
నాయకు బ్రదికించి నిలిపి నరనాథ! మము
న్నీయత్నంబునకుం దగ
నేయిష్టంబైన నడుగు మిచ్చెద మనుడున్.

100


క.

దండాకృతిగా జనపా
లుండును ధరఁ జాఁగి నిచ్చలును ధనములు నా
భాండాగారము లేడును
నిండం గరుణింపుఁ డనిన నేర్పున వారున్.

101