పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

308

సింహాసన ద్వాత్రింశిక


బరివారంబుఁ గవీంద్రులుం గొలువఁగా భద్రాసనాసీనుఁడై
సరసాలాపకథానుకర్జనముల న్సంప్రీతితో నుండఁగన్.

72


క.

ధనహీనుం డొకవిప్రుం
డనువగుచోఁ బెండ్లి సేయ నర్థము వేడం
దనయచెయి పట్టుకొనుచుం
జనుదెంచెన్ దైన్యవృత్తి జనపతికడకున్.

73


చ.

దినకరతేజుఁడౌ జనపతిం గని దీవన లిచ్చి విప్రుఁ డి
ట్లనియె నృపాలశేఖర దయాపరిపూర్ణ మదీయభాగ్యజీ
వన యిది నాతనూభవ వివాహము సాగదు నేఁడు మేరగా
నెనిమిదియేఁడు లయ్యె ధనహీనుఁడఁ గావున వేఁడవచ్చితిన్.

74


సీ.

రాజ్యంబు వదలక రసికత్వ మెడలక
        జయశీల ముడుగక నయము చెడక
దీనులఁ జంపక దేశంబు నొంపక
        నిజ ముజ్జగింపక నేర్పు గలిగి
విపులఁ జుట్టాల వెన్ను సొచ్చినయట్టి
        వారిని గొల్చినవారిఁ బ్రజల
హర్షంబుతోఁ గాచి యన్యాయ ముడుపుచు
        మున్ను చెప్పినరీతిఁ జెన్ను మీఱి


ఆ.

చేత లొండు లేక ప్రాఁతల విడువక
యశము కలిమి దమకు వశముగాఁగ
వసుధయేలు రాజవర్గంబులోన న
య్యాదివిష్ణుమూర్తి వండ్రు నిన్ను.

75


వ.

ఈసీసపద్యంబులో గీతసహితంబుగా నాఱుపాదంబుల మొదలియక్షరంబులు, నందర్థంబుల మొదలియక్షరంబులుఁ గ్రమంబునం గూడుకొనంగ