పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

307


క.

విను కలహకంటకుఁడ గ్ర
క్కున నాతని గౌఁగిలించుకొను మనవుడు నే
మని సంతసపడుదు మొకటి
యును వీడము పోటులాట యుడిపితిరేలా.

67


గీ.

అనుడు దెలిసి పొడువుమ మాయన్న యంటి
యన్నదమ్ముల కొకకలహంబు గలదె
యనిన దక్కలపడుచు నెట్లాడిరేని
నేమి దప్పగు ననుడు మంత్రీశ్వరుండు.

68


క.

ఓకలహకంటకుడ యిది
నీకొఱకై కాదు శత్రునిన్ డగ్గఱుచుఁన్
రాకొట్టి పిలిచి మది ను
ద్రేకము పుట్టించి పోటు దెలుపఁగవలయున్.

69


ఆ.

కవులు పొగడువేళఁ గాంతలు రతివేళ
సుతులు ముద్దువేళ శూరవరులు
రణము సేయువేళ రాకొట్టి పిలుచుట
పాడి యిదియ మిగుల భజన కెక్కు.

70


వ.

వెండియు నీ వెంత చలంబు గొన్నను గారణంబు లేనిజగడంబు గావున భగవతియు బేతాళుండును నట్లాడించి రింకఁ బాడిగాని చేతలకుం జొరక రమ్మని డగ్గఱం దిగిచిన నప్పుడ రాజులుం బరివారంబును బ్రజలు నిదియ పంతంబనం గలహకంటకుండును నేకాంగవీరుండును గౌఁగిలించుకొని యొడయని యడుగులం బడిన.

71


మ.

ధరణీనాయకుఁ డిద్దఱ న్సమముగా దాంబూలజాంబూనదాం
బరభూషాదుల నాదరించి వరుసం బార్శ్వంబుల న్రాజులుం