పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

303


మగతనముఁ గటారియుఁ దో
డుగ నయ్యేకాంగవీరుఁడుం జనుదెంచెన్.

47


సీ.

అపుడు చుక్కలలోన నమృతాంశుగతి దోఁప
        రాజులు గొలువంగ రాజు వెడలి
వచ్చినఁ దత్పరివారసమేతుఁడై
        పడవాలు డగ్గఱి భటులఁ జూపి
వారివైరముఁ బరివారంబుఁ దగవును
        మున్నుగా నన్నియు విన్నవించె
దనలెంకఁ దిట్టి యిద్దఱ నొక్కటిగఁ జేయ
        భట్టి నంగాధిపుం బాలుపెట్టె


ఆ.

వారు మాకు సెలవుగా రెండుమాటలు
విడువుఁడనియు నృపునివెఱపు సూపఁ
బనిచెఁ గర్త గాన బంటుతనమునకు
విడుతురయ్య. .......

48


క.

నావుడు నిద్దఱుఁ జని పృ
థ్వీవరునకు వాండ్రచలము వినిపించిన నే
నీవీరుల నొప్పించుట
భావం బొడఁబడ దటంచుఁ బతి చింతించెన్.

49


క.

ఆవేళ నమాత్యుండు మ
హీవర నీమాట సేయ రేమనవచ్చున్
లావరులై లెంకల మని
కావరమున నున్నవారు గైకొన రొరులన్.

50


ఆ.

పసుల కుయ్యి గాదు బ్రాహ్మణు చెఱ గాదు
స్వామి హితము గాదు వ్రతము గాదు