పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

302

సింహాసన ద్వాత్రింశిక


క.

అమ్మాటలు విని పెద్దలు
మమ్మిట మన్నించి మీరు మాకిట జగడం
బిమ్మనినఁ గలహకంటకుఁ
డెమ్మెయి మెయికొనక యున్న నిరవడనిమతిన్.

43


వ.

మీర లిద్దఱు రాచలెంకలు గావున నారాజులు సూడంగఁ బోట్లాడవలయు నాయితపడి రం డనిన మాకు నిదియ యాయితంబు బంటువానికిం గటారి చేత నున్నంజాలదె యనుడు నేమియు బంటుతనంబునకుఁ గొఱఁత గాదు రాజు వెడలివచ్చునంతకుం బోయి రండని యొండొండ యనిపినం జని రనంతరంబ.

44


సీ.

కఱకంచువలిపెంబు గట్టిగాఁ గాసించి
        చెలిత్రాడు కాసెపై బలియఁజుట్టి
దేహంబు కప్పుగా లోహకంచుకలీల
        జిగిబిగిగల నల్లజిగు రమర్చి
వక్షఃస్థలంబున రక్షపూసలపేరు
        దండతాయెతులును దగ ధరించి
తిలకంబు దళముగాఁ దీర్చి చుంగులపాగ
        తలముడితోఁ జొళ్ళె మలవరించి


ఆ.

కేలఁ బుల్లతియును నీలి నూలునఁ బూని
కేలిగతిఁ గటారికోల వట్టి
సంగడీలు గొల్వఁ జనుదెంచె నొకమత్త
గజముఖంగి కలహకంటకుండు.

45


వ.

అటఁ గొందఱు సంగడీలం గూడి.

46


క.

నగుమొగ మలరఁగఁ గస్తురి
తిగురు మెయి న్నలఁది గాసె దిటమై మెఱయన్