పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

298

సింహాసన ద్వాత్రింశిక


బర్బరపతి వీఁడె పాంచాలపతి వాడె
        మత్స్యాధిపతి వాఁడె మానవేంద్ర


ఆ.

యనుచు వేఱువేఱ నందఱ నెఱిఁగించి
యధిపుచేతఁ గుశల మడుగఁజేసి
వీడియముల గారవింపించె నీతిస్వ
తంత్రబుద్ధి యైన మంత్రివరుఁడు.

24


క.

అజ్ఞనపతు లందఱుఁ దన
పజ్జం జనుదేర మండపములోనికి వి
ద్వజ్జనచింతామణి యగు
నుజ్జయినీధరణిపాలుఁ డొయ్యనఁ జనియెన్.

25


ఉ.

అందు వసంతుని న్రతి ననంగుని లక్ష్మి నుపేంద్రు గౌరి న
య్యిందుకళాధరు న్శచి సురేంద్రుఁ గ్రమంబునఁ బూజచేయఁగా
దుందుభిమర్దళప్రముఖతూర్యరవంబులు నిండ నేర్పున
న్సుందరు లాటపాటల వినోదము సూపిరి తీపులంటఁగన్.

26


వ.

అప్పుడు కర్పూరాదిసుగంధద్రవ్యంబులు వసంతచాలనం బొనర్చెడివారిలోనుండి కలహకంటకుం డను రాచలెంక వెడలి వచ్చుచుఁ దనమీసములను నంటిన సుగంధంబు విదిర్చికొనుచుఁ జూచిన నెదుర నున్న యేకాంగవీరుం డను నంగపతిలెంక తనదు దురభిమానంబునం గనలి.

27


క.

ఏరా ముందఱ గానక
నేరమి పైఁ దెచ్చుకొనుచు నీమీసలు నా
చేరువ వడిపెట్టెద విది
యోరీ యేకాంగవీరుఁ డుంట యెఱుఁగవే.

28


క.

నావుడుఁ బరిమాళించెద
నీ వుండుట యెఱిఁగి కాదె యిది వ్రేటుగ నేఁ