పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

297


ట్టించితిం గాంతి దిక్కుల నటింపఁగఁ గాంచనతోరణంబు లె
త్తించితి విన్నవింప నరుదెంచితి రాఁ గరుణించు భూవరా.

20


సీ.

అని విన్నవించిన జనవల్లభుండును
        జతురంగబలములు సరస నడువ
భేరులు శంఖము ల్పెద్దగౌరులు మ్రోయ
        దిక్కుల నినదంబు పిక్కటిలఁగఁ
గవిరాజగాయకస్తవములు నిగుడంగ
        శూరులు ధీరులుఁ జేరికొల్వ
నమ్మహోత్సవమున కాభరణంబులౌ
        నంగనారత్నంబు లరుగు దేరఁ


ఆ.

బ్రజల కెల్లను గన్నులపండు గౌచు
వాయువేగ మనుత్తమాశ్వంబు నెక్కి
గతులఁ ద్రిక్కించి మెఱయుచు గవని వెడలి
యరిగె నుద్యానవనములో నవనివిభుఁడు.

21


ఉ.

అప్పుడు చేరవచ్చి సమయం బిది దర్శనయోగ్యమంచు న
వ్వొప్పెడు కాంతలుం దురగయూథము రత్నచయంబు మున్నుగాఁ
గప్పము లెల్లఁ దెచ్చి మది గప్పెడుభీతి దొలంగ నమ్రులై
యొప్పన చేసి రానృపతు లుజ్జయినీపతికిం గ్రమంబునన్.

22


సీ.

అంగాధిపతి వీఁడె వంగాధిపతి వాఁడె
        నేపాళపతి వాఁడె భూపతిలక
కర్ణాటపతి వీఁడె కాంభోజపతి వాఁడె
        సౌవీరపతి వాఁడె సౌర్వభౌమ
గూర్జరపతి వీఁడె కోంకణపతి వాఁడె
        కుంతలపతివాఁడె కంతురూప