పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

295

సప్తమాశ్వాసము


శా.

కాయం జొచ్చె రసాలము ల్విరహు లాకంపింపఁగాఁ గోయిల
ల్గూయం జొచ్చె మనోజదిగ్విజయ మాఘోషించుచుం దుమ్మెదల్
మ్రోయం జొచ్చె నవీనపుష్పశరము ల్మొత్తంబుగాఁ జిత్తజుం
డేయం జొచ్చె సతు ల్మదిం గలఁగఁగా నెచ్చోటులుం దానయై.

12


సీ.

గంధ బంధురుఁ డైన గంధవాహుండు ము.
        న్నేర్చినపట్టపుటేనుఁ[1] గనఁగఁ
బచ్చపక్కెరలట్లు పక్షంబు లొప్పారు
        వరకీరములు వారువము లనంగఁ
బదహతిఁ బుప్పొళ్ళు పర్వఁగా నేతెంచు
        నలులమూఁకలు కాలిబలము లనఁగఁ
బంచమస్వరములఁ బరిణమింపగఁజేయు
        పికములు కీర్తిగాయకు లనంగ


ఆ.

నేచియున్న మావు లెల్ల గొల్లెన లన
లలిత మైనరాజ్యలక్ష్మి మెఱసి
యితరనృపులభంగి ఋతుచక్రవర్తియు
నతనిఁ గొల్వవచ్చి యచట విడిసె.

13


క.

ఆవృత్తాంతము దెలియం
గా విని సచివేంద్రుఁ డచట గందర్పసఖున్
భూవరులను సక్రియ సం
భావింపఁ దలంచి సార్వభౌమున కనియెన్.

14


ఆ.

ధరణిపాలు రెల్ల ధరణీశ మిముగొల్వ
వచ్చియున్నవారు వనములోన

  1. పట్టపు నేనుఁగు