పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

290

సింహాసన ద్వాత్రింశిక


వేవెంటఁ దిరిగి చోద్యము
లేవేఁ జూచితివొ చెప్పు మేర్పడ నన్నన్.

130


సీ.

ధరణీశ యెల్లతీర్థంబులు చూచుచు
        వెలసిన త్రిస్థానములకు నేగి
మగిడియేతెంచుచో మాణిక్యమయమైన
        పురములో గుడియొద్దఁ బొంగిక్రాఁగు
నూనెకొప్పెరఁ గంటి నానూనెలోపలఁ
        బడ్డవారికి నట్టిపట్టణంబు
నందులకన్యయు నగపడు నని యున్న
        పద్యంబుఁ జూచితిఁ జోద్యమదియు


ఆ.

ననిన సాహసాంకు డచ్చెరువందుచు
నాపురంబు చూత మనుచుఁ గదలి
చనియె నతనిఁ గూడి శస్త్రసహాయుఁడై
దుర్గమంబు లైనమార్గములను.

131


వ.

చని చని యచట దేదీప్యమానం బైనపురంబు సొచ్చి తద్విభవంబు వర్ణించుచు ముందఱ నతిసుందరంబైన పందిరిక్రింద సువర్ణమయజలపూర్ణకలశంబులను మృగనాభిలేపనంబులను, ముక్తాఫలరంగవల్లికలను, గనకరంభాస్తంభంబులను, రత్నతోరణంబులను నలంకృతంబైన వివాహవేదికపై పలకలోని పద్యంబు చూచి సముత్సుకుండై.

132


క.

చేరువగుండములోపలఁ
గోరికతో జలకమాడి గుడిలో లక్ష్మీ
నారాయణులం గాంచియు
ఘోరం బగు నుడుకునూనెకొప్పెరఁ జేరెన్.

133


వ.

ఇట్లు చేరి.

134