పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

287


గ్రాలెడి గంగాయమునల
నోలాడె నినుండు మకరయుతుఁ డౌ వేళన్.

115


మత్తకోకిల.

అందు భక్తులు ముక్తిత్రోవకు నందుకోలగు నందమౌ
బిందుమాధవదేవునిం గని ప్రీతిఁ గొల్చి వినీతుఁడై
యిందుశేఖరు విశ్వనాథు ననేకభంగులఁ గొల్చునా
పొందుచేకుఱ నేగె విప్రుఁడు పుణ్యరాశికిఁ గాశికిన్.

116


వ.

అచ్చటం గదలి య ట్లేగి యష్టభైరవేశ్వరంబును, భూతభైరవేశ్వరంబును, గాలభైరవేశ్వరంబును, గపాలేశ్వరంబును, బాతాళభైరవేశ్వరంబును, మతంగేశ్వరంబును, జంబుకేశ్వరంబును, మణికర్ణికేశ్వరంబును, సాంబాదిత్యంబును, గరుడాదిత్యంబును, లోలార్కంబును, బిందుమాధవంబును మున్నుగాఁగల బహుకోటితీర్థంబులచేత నలంకృతంబైన పంచక్రోశంబుఁ బ్రవేశించుచుఁ దద్గుణప్రశంసోన్ముఖుండై.

117


క.

శివుఁ డిందుఁ బడ్డవానికి
జెవి మంత్రముఁ జెప్పఁ బూని శిర మటు వంపన్
శవముపయిఁ బడినసురనది
శివపదరాజ్యోచితాభిషేకము సుమ్మీ.

118


క.

ఉడుమైనఁ దొండయైనను
గడఁజైనను దుప్పియైనఁ గడువెస వీటం
బడునప్పుడె పురుషుండును
బడఁతియు నగురూపు వడసి పడనేరదటే.

119


వ.

అని కొనియాడుచు.

120


శా.

ప్రాలేయాచలచందనద్రవసుధాప్రాచుర్యవీచీలస
త్కేలీడోలవిశాలశీలసుమనఃస్త్రీజాలఫాలస్థలా