పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

284

సింహాసన ద్వాత్రింశిక


ఉ.

అక్కలహంబు చూచి చని యానృపశేఖరుఁ డాజి భూమిలోఁ
జిక్కిన యశ్వరత్నములు సింధురబృందములు న్రథంబులుం
బెక్కుధనంబు లస్త్రములు భేరులు జోళ్ళును గోటలోనికిం
గ్రక్కునఁ గొంచు నేగి యధికం బగుసంపద నేలె నప్పురిన్.

97


వ.

అనిన విని యయ్యవధూతకుం డిది భాగ్యం బంటి వేని పూర్వకృతసుకృతివిశేషంబున నిది లభించెం గాక కానినాఁ డిటు గా నేర్చునే తొల్లి నేఁడునుం జేయవేని నింతియ కాదు యక్షసహాయంబు గలిగియు నుద్యోగి యయ్యరణ్యంబు గడచి మద్రపురంబుఁ జేరిన కతంబున రాజ్యంబు గలిగెం గావున దైవంబున కుద్యోగంబు ఫలసాధకం బగు నది కారణంబుగ నీవును రాజ్యం బేమఱక పాలింపు పొమ్మని వీడ్కొలుపుచు.

98


క.

నీమహిమకుఁ గడు నెలవగు
భూమీశ్వర! భూమి నిది యపూర్వం బనుచుం
గామితఫలదాయకమై
లేమి యుడుపు చంద్రకాంతలింగము నిచ్చెన్.

99


క.

ఇచ్చినఁ గైకొని పురికి
న్వచ్చునెడ న్విప్రుఁ డొకఁడు వదనము వాడ
న్వెచ్చని యూర్పుల నాఁకట
వచ్చుచుఁ జనుదెంచి మనుజవిధు దీవించెన్.

100


ఆ.

మూఁడు దినము లయ్యె వేఁడంగ నెచ్చట.
గమికెఁడన్న మైనఁ గలుగదయ్యె
గ్రాసమాత్రమేమి గలిగిన నా కిచ్చి
నన్నుఁ గరుణ బ్రోవుమన్నఁ జూచి.

101


క.

ఇక్కడ నన్నము దొరకదు
ది క్కితనికి నెద్ది పసిఁడి దినరా దిఁ