పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

278

సింహాసన ద్వాత్రింశిక


త్ర్యంబకునిదేవి యగు జగ
దంబకు నంబికకు భక్తి నర్చన లిచ్చెన్.

62


ఉ.

ఆకడ మున్న చండికకు నర్చన లిచ్చుచుఁ గొల్చియున్న య
స్తోకతపఃప్రసిద్ధుఁ డవధూతుఁడు చూచి యుదారమూర్తి నీ
వీకడ కేల వచ్చి తను డేను విదేశిఁ బరిభ్రమించుచున్
మీకృపఁ గోరి తీర్థములు మెట్టుచు నిక్కడ కేగుదెంచితిన్.

63


క.

అనవుడు నాతఁడు నవ్వుచు,
ననుమానములేదు విక్రమార్కుఁడ వగుటం
గని యెఱుఁగుదుఁ బూర్వంబున
నను మూడుని జేసి మొఱఁగ నాయం బగునే.

64


వ.

అనిన నతం డే నియ్యడం బరదేశి నగుట దప్పదు సకలరాజ్యభారంబున నీతిధురంధరుం డగు మంత్రిశిరోమణి భట్టిం బురంబున నిల్పి భవాదృశు లగు పురుషరత్నంబులం జూచుట కారణంబుగాఁ దీర్థంబులం దిరుగుచున్నవాఁడ ననిన నజ్జనవల్లభునకు బుద్ధి సెప్పుచు సిద్ధవల్లభుం డిట్లనియె.

65


క.

పూజ్యుఁడవు సకలతిమిరహ
రజ్యోతిరూప మైనరవిమూర్తివి నీ
రాజ్యంబు నిఖిలధర్మ
ప్రాజ్యం బది విడిచి యిటకు రాఁదగ వగునే.

66


క.

ధనముం గృషియును విద్యయు
వనితయు నృపసేవనంబు వాణిజ్యంబుం
దనధర్మంబుఁ జికిత్సయు
ననుదినమును గట్టిగాఁగ నరయఁగ వలయున్.

67


ఆ.

ధరణిఁ దిరుగ నన్యధరణిపతులచేత
నచట నొండు కార్య మయ్యెనేని