పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

268

సింహాసన ద్వాత్రింశిక


ఉ.

ఖండితవైరిమండలుఁ డఖండపరాక్రమదర్పశాలి యా
ఖండలవైభవుండు త్రిజగద్భరితామలకీర్తిచంద్రికా
మండితమండలాగ్రుఁడు సమగ్రజయాస్పదబాహుయుగ్ముఁడై
చండతరప్రతాపుఁ డగుసాహసభూషణుఁ డుర్వి యేలుచున్.

5


ఆ.

ఆఱునెలలు గడపి యంత దేశాంతర
మరిగి వనము లూళ్ళుఁ దిరుగుచుండి
కనియె గంగపొంత జనమేజయుం డను
ధర్మశాలి దైన ధర్మపురము.

6


క.

ఆయగ్రహార మొయ్యన
డాయఁగ మాపైన నొక్కటన్ ద్విజునింటన్
రేయుండి రేపకడ నది
తోయంబులఁ గ్రుంకఁ జనుచు ధూర్జటిఁ దలఁచెన్.

7


ఊ.

కామునిఁ గాల్చి బూడిదను గంధముగాఁ గొని యెద్దు నెక్కుచుం
బాములుఁ దోలు నెమ్ములుఁ గపాలములుం దనమేనిసొమ్ముగా
గాములఁ గూడి యాడుచును గాడు గృహంబుగ నున్నవాఁడు గం
గామృత మౌదలం జిలికి నంత సదాశివుఁ డయ్యె నెల్లెడన్.

8


క.

అనుచుం గనుఁగొనెఁ గృతముని
జనసంగన్ ద్విజసురంగఁ జపలతరంగన్
ఘనకంకణలసదంగన్
జనితామితదురితభంగ జాహ్నవి గంగన్.

9


వ.

కని మ్రొక్కి శుచియై సచేలస్నానంబు సేయుచు.

10


క.

మలినుఁడు మై గడఁగిన ని
ర్మలుఁ డౌ టది చెల్లు లోకమాతా! నీలో