పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

253


యమృత మైనఁ జల్లి యన్న ప్రాణంబులు
గావరయ్య మమ్ముఁ బ్రోవరయ్య.

253


వ.

అని జననీజనకులు (క్రమంబున) వేఁడినఁ దజ్జీవనోపాయం బెఱింగి విహగేంద్రుం డింద్రుం బ్రార్థించి యమృతంబుం దెచ్చి యిచ్చట విపన్నంబు లగు పన్నగంబుల తోడ నిప్పన్నగకుమారరక్షకుం గాచెద నని పూని.

254


ఉ.

పోయుదుఁ బ్రాణము ల్మగుడఁ బూనిక దప్పిన మేరు వబ్ధిలోఁ
ద్రోయుదు నెల్లదేవతలఁ దోలుదు నాకముఁ బట్టి పాడుగాఁ
జేయుదు నష్టదికృతులఁ జెండుదు మేదినిఁ గ్రింద మీఁదుగా
వ్రేయుదు వీనిపై నమృతవృష్టి వడిం గురియింతు నింతటన్.

255


క.

అని గరుడుఁ డెగసి యేఁగినం
దనయునిదెసం జూడలేమిఁ దడయక ఫణినం
దనుచేత ఖచరసతి చం
దనచితు లొనరించుకొనియెఁ దత్పార్శ్వమునన్.

256


వ.

అంత నత్యంతసతీమండనంబులు గైగొని బ్రదక్షిణంబు గాఁ దిరుగుచు గౌరి నుద్దేశించి.

257


క.

ఓయంబిక యుత్తముఁ డధి
కాయువు విద్యాధరేంద్రుఁ డగుఁ బతి యనుచు
న్నాయుద్యోగం బుడిపితి
నీయానతి దప్పె నింక నిన్నే మందున్.

258


క.

అని దూఱఁగ ముందఱఁ గాం
చనలతగతి మెఱుఁగుదీఁగ చాడ్పునఁ గాత్యా
యని వచ్చి పుత్రి నిలునిలు
మని తత్పతిమీఁదఁ జేతియమృతము చల్లన్.

259