పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

250

సింహాసన ద్వాత్రింశిక


ధనకనకాదులు తనియ నిత్తురు గాక
        ప్రాణంబు లొసఁగెడు ప్రభుఁడు గలఁడె
తనతల్లికడుపు చలన చేసికొన నోపి
        శంఖచూడుఁడు నీకుఁ జా వొనర్చెఁ
జీఁకువట్టినకోల యీకుమారుం డని
        గరుడుని కేలొకో కరుణ లేదు


ఆ.

దైవమేల యిట్లు దలఁచె నే నెట్లోర్తు
నేమి సేయుదాన నెందుఁ జొత్తుఁ
బాసి యేఁగఁ దగునె మూసీనముత్తెమ
పంజరమ్ముచిలుక పసిఁడిబొమ్మ.

237


క.

మలయవతిమీఁది ప్రేమము
మలయించెనే దైవ మిట్లు మ మ్మెడచేసెం
బలుకొకటి బ్రాఁతి చిలుకల
కొలికీ నాచందమామకూనా నీకున్.

238


వ.

అని విలాపింపఁగఁ బ్రాణహానికి శంకించెద రని తనప్రాణంబులు చిక్కఁబట్టి యల్లన కనువిచ్చి జననీజనకులం జూచి.

239


క.

గురులార మీకు నాకై
పురపురఁ బొక్కంగవలదు భువి “ధర్మస్య
త్వరితాగతి" యనుపలుకునఁ
బరహిత మొనరింపఁ గంటి బ్రదు కిది గాదే.

240


ఉ.

అస్థిగృహంబు దేహము దురాశలఁ జిల్లులు వోవస్రుక్కి రో
గస్థితిఁ జిక్కి చచ్చు టధికం బగుమోసము గాక, దానిలో