పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

232

సింహాసన ద్వాత్రింశిక


వ.

అని వేడుకొని మలయవతిం జూచి.

148


సీ.

వనిత నీకన్ను లొయ్యన విచ్చి చూడవే
        మారుబాణము లరుదేరనోడు
నబల మావీనుల కమృతంబు చిలుకఁగాఁ
        బలుకవే చిలుకలు పలుకనోడుఁ
గోమలీ నీదు ముంగురులు పాటింపవే
        తేఁటిదాఁటులు కొంత దాఁటనోడు
ధవళాక్షి నీముఖదర్పణం బెత్తవే
        సోముఁడు నీదెసఁ జూడనోడుఁ


ఆ.

బడఁతి మమ్ముఁ దగినపనిఁ బంపఁజీరవే
కోకిలంబు లిచటఁ గూయనోడు
మగువ చల్ల నూర్పు నిగిడింపవే యింద
మలయమారుతంబు మలయనోడు.

147


వ.

అని ధైర్యంబు పట్టుకొల్పిన నమ్ముద్దియ తనవేదన దీఱు తెఱంగు చెప్పంబూని వ్రీడావశంబున నోడి మారుప్రేరణం దవులుకొని చెలిం జూచి.

148


క.

ప్రథమముననుండి చిత్త
వ్యథ యెఱుఁగుదు ప్రాణసఖివి వలనైన మనో
రథ మొనగూర్పక యీమ
న్మథుబారికిఁ ద్రోవ నీకు నాయం బగునే.

149


క.

రతిపతికిఁ దోడుపడి యో
చతురిక వెనువెంట మందు చల్లుచు నన్నున్
బతిమాలించెద వకటా
హితులుం బగవారిఁ గూడి రేమనవచ్చున్.

150