పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

225


కుందమకరందబిందు
స్పందానందనుఁడు మందపవనుఁడు వీచెన్.

109


వ.

అంతఁ దదాగతకుసుమామోదవాసితమలయసమీరాప్యాయనశరీరాయాసాపహారుండై.

110


క.

ఎడపని కూరిమితో న
య్యెడఁ బుత్రికి నీడ యైన హిమశైలము కై
వడి బెడఁ గడరెడు పటికపు
గుడి బొడఁగని యక్కుమారకుం డటుచేరెన్.

111


క.

అంగనమున నభ్యంతర
సంగీతాకర్ణనమునఁ జలియింపక వే
డ్కం గసవు మేయకున్నకు
రంగంబులఁ జూచె నంతరంగు బలరన్.

112


వ.

చూచి తత్సంగీతప్రసంగసాంగత్యకారణం బగు జాణం జూతము రమ్మని యిష్టసఖుం డైన మధుకరుం గూడి తద్ద్వారంబుఁ దూఱి.

113


సీ.

చిన్నిచన్నులమీఁదఁ జేర్చినవీణియ
చేఁదోడుగా శ్రుతిస్థితులఁ దీర్చి
సరిగమపధను లన్సప్తస్వరంబుల
గమకంబు లయవిభేదముల నెఱపి
నాదామృతంబున ననిచినక్రియఁ దంత్రిఁ
బెనఁగొని నఖకాంతి గొనలుసాఁగ
రాగకదంబంబు రంజిల్లఁ జేయుచు
నాలతి వీనుల కమృత మొసఁగ


ఆ.

గానరసవశమునఁ గనుఁగవ మోడ్చుచు
బోటిఁ గూడి వాణిబోటిఁ బోలె