పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

224

సింహాసన ద్వాత్రింశిక


తామణి శరణాగతర
క్షామణి ఖచరేంద్రకులశిఖామణి యయ్యెన్.

103


క.

పితృదత్త మైన కల్ప
క్షితిరుహ మర్థులకు నొసఁగి చిక్కిన ధనసం
హతిఁ దనబంట్లకుఁ బ్రజలకు
హితులకుఁ దగ నిచ్చె రిపుల కెడ రిడి యనఁగన్.

104


ఆ.

పురముఁ గొనఁదలంచు, నరులఁ జంపఁగఁబూని
జీవహింస కోడి చింతనొంది
తల్లిదండ్రు లున్నఁ దగుఁగాక యిదియేల
యనుచు గురులజాడ నరుఁగఁ దలఁచె.

105


వ.

తలఁచి సఖుం డైన మధుకరుం గూర్చుకొని యరిగి తజ్జననీజనకులం గని సాష్టాంగంబుగాఁ బ్రణమిల్లిన వారలు సంతుష్టాంతరంగులై యుండం జేరి.

106


క.

తత్పదపంకజసేవా
తత్పరమతి విరులుఁ బండ్లుఁ దాఁ దెచ్చుచు నా
సత్పురుషుఁడు మలయమహీ
భృత్పార్శ్వమునం జరించెఁ బితృభక్తుఁ డనన్.

107


మ.

ఒకనాఁ డిష్టసఖుండుఁ దాను ఫలపుష్పోపార్జనాసక్తితో
వికచాంభోజసరోవరంబుల నవావిర్భూతచూతాదిజా
లకజాలంబుల రాజకీరమదరోలంబాగ్రపుష్పంబులం
బ్రకటశ్రీగుణగణ్యమౌ నొకతపోరణ్యంబు సొత్తేరఁగన్.

108


క.

ముందఱ గౌరీమందిర
మందారనవారవిందమాకందలతా