పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

221


ఆ.

ఎవ్వఁ డిష్టజనుల కిష్టదర్శనమునఁ
బావసంచయంబుఁ బాపుచుండు
నట్టిలోకమిత్రుఁ డైన తేజోనిధి
కోకములకు విరహశోక మణఁచె.

87


మ.

గిరిశృంగంబుల గైరికాకృతిని శాఖిశ్రేణిపైఁ బల్లవో
త్కరలీలం గరిరాజకుంభములమీఁద న్రక్తచూర్ణాకృతిన్
శరధిద్వీపములం బ్రవాళరుచిఁ గాసారంబుల న్శోణపు
ష్కరకాంతిం దరుణాతపంగం బడరె దిక్కాంతాంగకాశ్మీరమై.

88


చ.

కలువలవైరి జక్కవలఁ గావఁగఁబూనిన దాత ముజ్జగం
బులకును సాక్షి యంబరవిభూషణ మానెలతాల్పువేల్పుకు
న్వలపలికన్ను ముక్తితలవాకిలి చీఁకటివీడుకోలు నా
వెలుఁగులఱేఁడు తామరలవిందు వెలుంగుచునుండె నయ్యెడన్.

89


క.

సంధ్యావందనవిధి యా
వింధ్యానదిలోనఁ దీర్చి విభుఁ డనవరతా
వంధ్యారంభుం డల్లన
వింధ్యాద్రిబిలంబుఁ జేరె విప్రునిఁ గావన్.

90


క.

కాలుని కేళీశైలముఁ
బోలెడునచ్చోటి యస్థిపుంజముఁ గని భూ
పాలుఁడు మనమున నధికకృ
పాళుండై వధ్యభూమి బలియై నిలిచెన్.

91


ఆ.

అంత నింతిఁ గూడి యసుర యార్చుచు వచ్చి
యోరి పిండివంట లుజ్జగించి
నేఁడు నీవె వచ్చినాఁడ విదేమిరా
యనుడుఁ దెలియఁబలికె మనుజవిభుఁడు.

92